ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?

ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది?

KCR పాలనలో ఆత్మహత్యలు లేని రోజు ఎప్పుడొస్తుంది? అంటూ ప్రశ్నించారు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. వరుసగా ప్రతీ రోజు రాష్ట్రంలో ఒకరు వేరే వేరే కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు.  ఓ రోజు నోటిఫికేషన్స్ లేక చనిపోయే నిరుద్యోగి వంతు. ఓ రోజు పంట కొనకపోవడంతో చచ్చే రైతు వంతు. ఓ రోజు ధరణి తప్పుల తడకకు చనిపోయే రైతు వంతు. ఓ రోజు అసైన్డ్ భూముల కోసం బలైన రైతు వంతు. మరో రోజు పోడు భూములకై ఆత్మహత్య చేసుకొనే గిరిజన రైతు వంతుఓ రోజు ఫీల్డ్ అసిస్టెంట్ ల వంతు.ఓ రోజు RTC ఉద్యోగుల వంతు. ఓ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ అందని విద్యార్థి వంతు. ఓ రోజు వైద్యం అందని కరోనా రోగుల వంతు. అంటూ ఆత్మహత్యలకు కారణాలు వివరిస్తూ.. ఆమె ట్వీట్ చేశారు. ఇదే కేసీఆర్ పాలనలో బతకలేని తెలంగాణ. బంగారు తెలంగాణలో ఆత్మహత్యలు ఆగాలంటే, చావులు లేని తెలంగాణ రావాలంటే దొరగారి అహంకారాన్ని దించాలని షర్మిల సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ట్వీట్ కు తెలంగాణలో ఆత్మహత్య చేసుకనున్న రైతులు, ఉద్యోగం రాలేదని ఉరేసుకున్నాడు అనే ఓనిరుద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన పేపర్ వార్తల క్లిప్పింగ్స్ ను కూడా యాడ్ చేశారు షర్మిల.