తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు టీవైఎస్ఆర్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. తాను పెద్ద రైతుననే చెప్పుకొనే కేసీఆర్ మొద్దు నిద్ర పోతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రెండు నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని రైతులు కన్నీళ్లు పెడుతున్నా... దొరకు కనిపించడం లేదని విమర్శించారు.
వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో మరో రైతు గుండె ఆగిపోయిందన్నారు షర్మిల. అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారు? ఇంకెంతమంది రైతుల ఉసురు తీస్తే మీ కండ్లు చల్లబడుతాయి? అంటూ సీఎంను షర్మిల ప్రశ్నించారు. కల్లాల్లో ఉన్న రైతును కాటికి పంపుతున్నవ్?
యాసంగి పంటలతో బిజీగా ఉండాల్సిన రైతును పాడె ఎక్కిస్తున్నవ్. వడ్లు కొనమని కాళ్ళు మొక్కించుకుంటున్నవ్. అంటూ సీఎంపై మండిపడ్డారామె. కేసీఆర్ ది రైతు ప్రభుత్వం కాదు... రైతును కాల్చుకు తింటున్న రైతు పాలిట రాబంధు ప్రభుత్వమంటూ ఆమె ధ్వజమెత్తారు.
నేను పెద్ద రైతునని చెప్పుకునే KCR మొద్దు నిద్ర పోతుండు.
— YS Sharmila (@realyssharmila) December 8, 2021
2 నెలలుగా ధాన్యం కల్లాల్లో పెట్టుకొని
రైతులు కన్నీళ్లు పెడుతున్నా దొరకు కనిపించడం లేదు.
వడ్లు కొనకుండా ఇక్కడ ధర్నాలు, ఢిల్లీలో డ్రామాలు చేయడంతో
మరో రైతు గుండె ఆగిపోయింది.
అయ్యా కేసీఆర్ ఇంకెంత మంది చస్తే వడ్లు కొంటారు?1/2 pic.twitter.com/X6XSBzH7ZQ