47వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

47వ రోజు కొనసాగుతోన్న షర్మిల పాదయాత్ర

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు YS షర్మిల పాద యాత్ర కొనసాగుతోంది. 47వ రోజు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తాళ్ల చెరువు గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది. పెద్దపోచారం గ్రామంలోని రైతు వేదిక దగ్గర...రైతులు పండించిన యాసంగి వడ్లను కేసీఆర్ కొనాలని డిమాండ్ చేస్తూ YS షర్మిల ధర్నా నిర్వహించనున్నారు. ఆ తర్వాత చిన్న పోచారం గ్రామం నుంచి నర్సింహులగూడెం క్రాస్, కృష్ణాపురం గ్రామం మీదుగా యాత్ర కొనసాగనుంది.  సాయంత్రం కూసుమంచి గ్రామంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు షర్మిల. సభ తర్వాత ధర్మ తండా క్రాస్, చింతల తండా గ్రామం మీదుగా యత్ర కొనసాగుతోంది.

 మరిన్ని వార్తల కోసం

జర్నలిస్టులు ఎంత పనిచేసినా గుర్తింపు తక్కువే

పిల్లల మొదటి స్కూల్‌‌ ఇల్లే