వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న షర్మిల

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న షర్మిల
  • ప్రాజెక్టులను సందర్శించి.. వరద బాధితులను కలవనున్న షర్మిల

హైదరాబాద్: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించారు. మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. ముందుగా 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో పర్యటిస్తారు. కడెం ప్రాజెక్టును పరిశీలిస్తారు. తర్వాత పోశయ్య గూడెం పోడు రైతులతో మాట్లాడతారు.
22వ తేదీన ఉమ్మడి కరీంనగర్  జిల్లాలో పర్యటిస్తారు వైఎస్ షర్మిల. అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజ్ ల పరిశీలనతో పాటు, వరద బాధితుతులను కలసి మాట్లాడనున్నారు. అలాగే 23వ తేదీన  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు షర్మిల.