
రంగారెడ్డి జిల్లా: YSR TP అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థాన యాత్ర ఐదోరోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నాగారం నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. కొత్తతాండ క్రాస్ దగ్గర ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు . మాన్సాన్ పల్లి దగ్గర లంచ్ విరామం తీసుకొని కొత్వాల్ చెరువు తండాలో మాట ముచ్చటలో పాల్గొననున్నారు. పాదయాత్రలో ఆమెకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంఘీభావం తెలిపారు.