ఐటీ నోటీసులపై తేలుకుట్టిన దొంగల్లా పచ్చ బ్యాచ్‌: వైసీపీ నేత కారుమూరి

ఐటీ నోటీసులపై తేలుకుట్టిన దొంగల్లా పచ్చ బ్యాచ్‌: వైసీపీ నేత కారుమూరి

ఐటీ నోటీసులపై పరువు నష్టం దావా వేయగలవా చంద్రబాబు అంటూ సవాల్‌ విసిరారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి.  ఐటీ నోటీసులపై మౌనం దాల్చడం వెనుక కారణం ఏమిటి చంద్రబాబు అని ప్రశ్నించారు.  ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై పచ్చ బ్యాచ్ తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారని ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు.  తమ ఇంటికి వచ్చి దర్యాప్తు సంస్థలను విచారించమని చెప్పే ధైర్యం చంద్రబాబు, లోకేష్  చెప్పగలరా అని అడిగారు.  చంద్రబాబు విషయంలో చీమ చిటుక్కుమంటే మీడియాలకు ఎక్కే దత్తపుత్రుడు(పవన్ కళ్యాణ్), పురంధేశ్వరి వంటి వాళ్లు ఐటీ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.    ఐటీ నోటీసులపై చంద్రబాబు మౌనం అర్ధాంగీకారమేనని తేల్చిచెప్పారు. తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. తప్పు చేయకపోతే స్టే తెచ్చుకోకుండా విచారణ ఎదుర్కోవాలి. లక్షల కోట్లు దోచేసిన బాబు అడ్డంగా దొరికేశాడు. అవినీతిపై ఎవిడెన్స్‌ లేదంటాడు కానీ, తప్పు చేయలేదని చెప్పడు. దర్యాప్తు ఆలస్యం కావ్వొచ్చు. కానీ బాబు జైలుకు పోవటం ఖాయం. తేలు కుట్టిన దొంగల్లా దుష్ట చతుష్టయం ఉన్నారని విమర్శించారు వెంకటరెడ్డి. 


ఐటీ నోటీసులు తప్పుడుగా ఇస్తే.. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి అబద్ధం చెబితే అందరిపైనా పరువు నష్టం దావా వేయాలి. సోషల్‌ మీడియాలో తప్పుడు వార్త పెట్టారని యువగంగాళం యాత్ర చేస్తున్న లోకేశ్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఐటీ నోటీసులపై  మాట్లాడడం లేదు. స్పందించడం లేదు. చంద్రబాబు కూడా కోర్టుల్లో కేసులు వేయడం లేదు. కానీ చంద్రబాబుకు అరెస్టు అవుతాననే భయం పట్టుకుంది. కాబట్టే ఇంటికి ఒకరు వచ్చి రక్షణ వలయంగా ఉండాలని.. చంద్రబాబు బీద అరుపులు అరుస్తున్నారు. ఏదైనా అంశం వస్తే.. చంద్రబాబు ఉదయం, మధ్యాహ్నం ప్రెస్‌మీట్లు పెడతారు.  ఐటీ శాఖ నోటీసులు ఇచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకు ఎలాంటి ప్రకటన ఎందుకు చేయలేదని నిలదీశారు వెంకటరెడ్డి. ప్పుడు ఐటీ నోటీసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబు, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. ఏదేదో మాట్లాడుతున్నాడని విమర్శించారు