వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. తమ ఖాతాలో క్రిప్టో కమ్యూనిటీకి సంబంధించిన పోస్టులు పెట్టారు. అంతేకాదు ఆ పార్టీ ప్రొఫైల్ పిక్, బయోడేటాను హ్యాకర్లు మార్చేశారు. డిస్క్రిప్షన్ లో ఎన్ఎఫ్టీ మిలియనీర్ అనే క్యాప్షన్ ను జత చేశారు. క్రిప్టో కరెన్సీకి మద్దతుగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ముందుకు వచ్చారన్న వార్తను కూడా ఇందులో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ జీ 20 సన్నాహక సదస్సులో మాట్లాడిన వార్తను కూడా జత చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాకింగ్‌పై ఆ పార్టీ టెక్నికల్ టీమ్ అలర్ట్ అయింది. అకౌంట్ రికవరీ చేసేందుకు రంగంలోకి దిగింది.