మందకృష్ణను పరామర్శించిన వైయస్ షర్మిల

మందకృష్ణను పరామర్శించిన వైయస్ షర్మిల

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు మంద‌కృష్ణ మాదిగను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయ‌కురాలు  వైయ‌స్ ష‌ర్మిల పరామర్శించారు. బుధవారం విద్యానగర్ లోని మంద‌కృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి ప‌రామ‌ర్శించారు. ఆయనకు ఇటీవ‌ల ఢిల్లీలో శ‌స్త్రచికిత్స జ‌రగడంతో ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని షర్మిల ఆకాంక్షించారు. అనంత‌రం సెప్టెంబ‌ర్‌ 12వ తేదీన ఆదివారం న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం తిరుమ‌ల‌గిరి ప‌ట్ట‌ణంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్వ‌హించ‌బోయే "ద‌ళిత భేరి" బ‌హిరంగ స‌భ‌కు మందకృష్ణను ఆహ్వానించారు. ద‌ళితుల ప‌క్షాన తన పోరాటానికి  మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని మంద‌కృష్ణను షర్మిల కోరారు.