సీఎం కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదని YSRTP అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో ఎనిమిదివేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పాదయాత్రలో భాగంగా రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పిన KCR...ఆ హామీని ఎందుకు మర్చిపోయారని ప్రశ్నించారు. అప్పులు తీర్చలేక బ్యాంకుల్లో వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారన్నారు. బీజేపీతో కుమ్మక్కై.. బాయిల్డ్ రైస్ ఇవ్వనని కేసీఆర్ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నారని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప..ఎవరూ బాగుపడలేదన్నారు. బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం