కోదాడ: ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయాత్ర 105వ రోజు కోదాడలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని షర్మిల ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్టుల పేరుతో కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకుంటోందని, ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపించారు. కేసీఆర్ ను గద్దె దించడానికే తాను పార్టీ పెట్టినట్లు చెప్పిన షర్మిల... అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలన తెస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదని షర్మిల చెప్పారు.
జనయాత్రలా ప్రజాప్రస్థానం.!!? pic.twitter.com/VGW593SEel
— ????? (@YSSR2023) June 25, 2022
YSR తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ సలహా కేంద్రం.!! pic.twitter.com/2IkTVpI2TG
— ????? (@YSSR2023) June 25, 2022