రాష్ట్రంలో కరెంటు బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే అన్నారు. మొన్నటి వరకు 80 యూనిట్లకు 188రూపాయలు వచ్చిన బిల్లు.. ఇప్పుడు ఏకంగా 307 రూపాయలకు చేరిందన్నారు. పెరిగిన ఛార్జీలతో పేద, మధ్యతరగతి ప్రజలు బతకడం భారంగా మారిందని ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు ఛార్జీలు పెంచి, జనాల ముక్కు పిండి బిల్లులు వసూల్ చేస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరెంట్ బిల్లులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి.పేదోడి ఇంట్లో బల్బ్ వెలగాలంటే జేబుకు చిల్లు పడాల్సిందే.
— YS Sharmila (@realyssharmila) May 13, 2022
మొన్నటి వరకు 80 యూనిట్ల లోపు వాడుకొంటే రూ.188 వచ్చిన బిల్లు
ఇప్పుడు రూ.307కు చేరింది.
ఇక పెరిగిన చార్జీలన్నీ 50,100,200 యూనిట్ల లోపు వాడుకొనే
పేద, మధ్య తరగతి వాళ్లకే భారం.1/2
మరిన్ని వార్తల కోసం