వ్యవసాయాన్ని పండుగ చేస్తాం

వ్యవసాయాన్ని పండుగ చేస్తాం

ఖమ్మం: తమకు అధికారమిస్తే వ్యవసాయాన్ని పండుగ చేస్తామని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా హామీ ఇచ్చారు. గురువారం వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 89 వ రోజు వైరా నియోజకవర్గంలోని గన్నవరం గ్రామంలో  కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల ట్రాక్టర్ నడిపి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే తాను వైఎస్ఆర్టీపీని స్థాపించానని చెప్పారు. ఉద్యోగాల కోసం రాష్ట్రం సాధించుకుంటే.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా  ఆత్మహత్యలు మిగిల్చాడని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. సున్నా వడ్డీ రుణాలు, నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాలు, రుణమాఫీ ఏమయ్యాయని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేసీఆర్ కు పోలిక లేదన్నారు. బతికినంత కాలం పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. 13 ఏళ్ల తర్వాత కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నారనడానికే  పెద్ద ఎత్తున గుమికూడిన జనసందోహమే నిదర్శమన్నారు. మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మరణం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకొస్తామని చెప్పారు.