- ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం
- 24 గంటలపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి(సీఈసీ) రాజీవ్ కుమార్కు కేంద్రం జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించిం ది. ఎన్నికల నేపథ్యంలో ఆయనకు ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. జడ్ కేటగిరీ సెక్యూరిటీలో భాగంగా రాజీవ్కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది 24 గంటలపాటు సెక్యూరిటీ కల్పించనున్నారు.
దాదాపుగా 40 మంది కమాండోలను ఆయనకు భద్రత కల్పిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. 2022 మే నెలలో ఆయన సీఈసీ గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, సీఈసీకి ఇలా జడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించడం గతంలో అరుదైన సందర్భాల్లో మాత్రమే జరిగింది. టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు వీఐపీ భద్రత ఉండేది.