
శ్రావణమాసం.. పౌర్ణమి రోజు అక్కా చెల్లెళ్లు.. అన్నా దమ్ముల హడావిడి అంతా ఇంతాకాదు.. ఆరోజే రాఖీ పండుగ.. రక్షాబంధనం. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 9 శనివారం వచ్చింది. అయితే జ్యోతిష్య శాస్త్రం రాశులు .. నక్షత్రాల గమనంపై ఆధారపడి ఉంటుంది.అయితే ఒక్కో రంగు రాఖీ ఒక్కో రాశి వారి వారిపై ప్రభావంచూపుతుంది. రాఖీ పండుగ రోజు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కడితే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈరాశికి కుజుడు అధిపతి. ఈరాశి వారికి ఎరుపు ( Red)రంగు రాఖీ కట్టడం వలన చాలా శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్ల మధ్య బంధం బలపడుతుంది. జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెతతారు.
వృషభ రాశి: ఈ రాశికి శుక్రుడు అధిపది.. మీ అన్నదమ్ములు వృషభ రాశికి చెందిన వారైతే నీలం (Blue)రంగు లేదా బూడిద(Grey) రంగు రాఖీ కట్టండి. మీ సోదరుడి జీవితంలో సానుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: ఈ రాశికి బుధుడు అధిపతి.. సోదరుడికి ఎలాంటి ఇబ్బందులు .. ఆపదలు రాకుండా ఉండాలని సోదరీమణులు రక్షాబంధనం పండుగ రోజు రాఖీని కడతారు. జ్యోతిష్య శాస్త్రం ఈ ఏడాది మిథున రాశి వారికి ఆకు పచ్చని(Green), ఎరుపు(Red), గంధం ( Sandle) రంగులో ఉండే రాఖీలను కట్టడం వల్ల మీ సోదరుడికి అన్నింటా విజయం లభిస్తుంది. కి అన్నింటా విజయం లభిస్తుంది.
Also Read:-రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి.. 3, 5, 7 ఎన్నో తెలుసుకోండి..!
కర్కాటక రాశి: ఈ రాశికి చంద్రుడు . చంద్రుడు శుభ దృష్టితో అన్నింటా విజయమే.. ఈ రాశి వారికి చంద్రుడి ఆకారంలో ఉండే తెల్లని (White) రాఖీని కట్టాలి. ఆర్థిక స్థోమత ఆధారంగా వెండి( Silver) రాఖీ కడితే ఇంకా మంచిది. ఈ రాశి వారు సాధ్యమైనంత వరకు తెల్లని వస్తువులు వాడితే ఈ ఏడాది అంతా ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
సింహ రాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి. ఈరాశి వారికి రాఖీ కట్టేటప్పుడు ఎరుపు (Red) లేదా గులాబీ ( Rose)రంగుల రాఖీలను కట్టాలి. వీరికి మనో బలం పెరిగి.. ఆలోచనా శక్తి వృద్ది చెందుతుంది.
కన్య రాశి: ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. వీరికి ఆకుపచ్చ (Green) , తెలుపు (White) రంగుల్లో ఉండే రాఖీని కట్టాలి. మీ సోదరులు హ్యాపీగా ఉంటారట.
తులా రాశి: ఈ రాశికి శుక్రుడు అధిపతి.. ఈ రాశివారికి రాఖీ కట్టేటప్పుడు నీలం (Blue)రంగు రాఖీ కట్టాలి. ఈ ఏడాది అంతా అన్నదమ్ములు.. అక్కచెల్లెళ్లు సంతోషంగా గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈ రాశికి కుజుడు అధిపతిగా సంచరిస్తాడు. వీరికి రాఖీ పండుగ రోజు ఎరుపు (Red) రంగు రాఖీని కట్టాలి. మీ సోదరుని జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు.
ధనస్సు రాశి: ఈ రాశికి గురుడు అధిపతి. ఈ రాశిలో జన్మించిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు (Yellow)రంగు, గంధం ( Sandle) రంగు రాఖీలను కట్టాలి. దీని వల్ల వారి కెరీర్ విజయవంతంగా కొనసాగుతుంది.
మకర రాశి: ఈ రాశి వారిని శని భగవానుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. వీరికి రాఖీ కట్టేటప్పుడు నీలం (Blue) రంగు రాఖీని కట్టాలి. ఈ ఏడాది అంతా సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి : ఈ రాశికి కూడా శని భగవానుడే అధిపతి . వీరికి కూడా నీలం (Blue) రంగు రాఖీ కట్టాలి. సోదరులు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా శనిభగవానుడి ఆశీస్సులు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
మీన రాశి: ఈ రాశికి గురుడు అధిపతి. ఈరాశిలో పుట్టిన వారికి రాఖీ కట్టేటప్పుడు పసుపు ( Yellow)రంగు రాఖీ కట్టాలి. ఈ ఏడాది అంతా శుభ ఫలితాలు వస్తాయని పండితులు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.