- రెస్టారెంట్ల నుంచి డెలివరీ చేయనున్న కంపెనీ
న్యూఢిల్లీ: కేటరింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలని జొమాటో చూస్తోంది. రెస్టారెంట్లతో తనకున్న పార్టనర్షిప్ను వాడుకోవాలని ప్లాన్ చేస్తోంది. పెద్ద మొత్తంలో ఆర్డర్లను డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తున్నామని కంపెనీ ఫుడ్ డెలివరీ సెగ్మెంట్ సీఈఓ రాకేష్ రంజన్ పేర్కొన్నారు.
‘ఇప్పుడు మా ఇంటి దగ్గర 20 మంది కలిశారనుకుంటే , ఇంత మందికి ఒకేసారి ఫుడ్ డెలివరీ చేయడం కుదరదు. పార్టీ లేదా లోకల్ చిన్న పిక్నిక్ ప్లాన్ చేసుకున్నా పెద్ద మొత్తంలో ఫుడ్ డెలివరీ కుదరదు. ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ, ఫుడ్ డెలివరీ ఈ సెగ్మెంట్లో పెద్దగా విస్తరించలేదు. ఈ సెగ్మెంట్పైనే మేము ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాం’ అని ఆయన వివరించారు.
ఒకేసారి వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్స్ పెట్టుకోవడానికి మల్టీ కార్ట్ ఫీచర్ను ఈ ఏడాది జూన్లో జొమాటో లాంచ్ చేసింది. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో ఈ స్ట్రాటజీని మరింతగా విస్తరించాలని కంపెనీ చూస్తోంది. చిన్న సైజ్ ఆర్డర్లు పెట్టే వారిని ఆకర్షించేందుకు జొమాటో ఈ ఏడాది ఎవ్రిడే లాంచ్ చేసింది. మరోవైపు లాయల్టీ ప్రోగ్రాం జొమాటో గోల్డ్ కింద మరిన్ని ఆఫర్స్ చేస్తామని రాకేష్ అన్నారు.