ముంబై: షేర్ మార్కెట్లోకి ఎంట్రీతోనే భారీ లాభాలతో అడుగుపెట్టింది ఫుడ్ డెలివర్ కంపెనీ జొమోటో. జులై 14 నుంచి16 మధ్య పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఆఫర్ చేసిన జొమోటో ఇష్యూ ధర కంటే 50 శాతం పైగా లాభంతో షేర్ ధర లిస్ట్ అయ్యింది. షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు కంపెనీ షేర్లు ఆఫర్ చేసిన ధర రూ.76 కాగా, ఇవాళ ఉదయం 10 గంటలకు షేర్ మార్కెట్ ఓపెన్ కాగానే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ.116తో లిస్ట్ కావడం విశేషం. షేర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు ఒక్కసారిగా 53 శాతం లాభం వచ్చినట్టయింది. నిమిషాల గ్యాప్లోనే 10.05 గంటలకు ఏకంగా రూ.135.60కి చేరింది. ఇక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(బీఎస్ఈ)లో రూ.115తో లిస్ట్ అయింది. అంటే బీఎస్ఈలో 51 శాతం ప్రీమింయం రేట్తో షేర్ ఓపెన్ అయింది. ఇక ఉదయం 10.05 గంటలకు రూ.134.70కు చేరింది. వాస్తవానికి ఈ నెల 27న లిస్ట్ అవ్వాల్సిన జొమోటో ముందుగానే ఎంట్రీ ఇచ్చి, షేర్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ నెల 14న పబ్లిక్ ఇష్యూకు ఓపెన్ అయిన జొమోటో రూ.9,375 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది. అయితే ఏకంగా 38 రెట్లు ఎక్కువగా కస్టమర్లు సబ్స్క్రైబ్ చేశారు. రూ.5 వేల కోట్ల కంటే అధికంగా ఉన్న షేర్లలో ఇది గడిచిన 13 ఏండ్లలోనే ఒక రికార్డ్.
ఐపీవో: భారీ లాభంతో జొమోటో ఓపెనింగ్
- బిజినెస్
- July 23, 2021
లేటెస్ట్
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఫ్యామిలీ మొత్తం మృతి
- నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
- Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!
- ప్రాణం పోసిన డాక్టరమ్మ... ఆరేళ్ళ బాలుడిని బతికించిన సీపీఆర్..
- Devara Fear Song: బీజీమ్తో వణికించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్..ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ ప్రోమో అదిరింది
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- వర్షాలపై రోనాల్డ్ రాస్ సమీక్ష.. ఇంజనీరింగ్ సిబ్బందిపై సీరియస్
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!