ములుగు, వెలుగు : ములుగు మండలం జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరుగుతున్న జోనల్స్థాయి క్రీడోత్సవాల్లో రెండో రోజూ కొనసాగాయి. మొత్తం 11పాఠశాలలకు చెందిన 935మంది విద్యార్థులు ఈక్రీడల్లో పాల్గొనగా, పలువురు విజేతలకు సీఐ సురేశ్తోపాటు జోనల్ అధికారి దేవసేన, ఇంటర్మీడియట్విద్యాధికారి చంద్రకళ, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విద్యార్థులు సామూహిక వందేమాతర గీతం ఆలపించారు.
పలువురు క్రీడాకారులు 14, 17, 17 ఏండ్ల విభాగాల్లో మెడల్స్సాధించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పీడీ వెంకట్రెడ్డి, డీసీవోలు భిక్షపతి, జె.యాదగిరి, స్టాప్ సెక్రెటరీ యాదగిరి, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
