
కొండాపూర్, వెలుగు: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి జడ్పీ హైస్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు గుండెపోటుతో చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. గురువారం ఉదయం ఎప్పటి మాదిరిగానే జువాలజీ టీచర్ మధుసూదన్(52) స్కూల్కు వచ్చారు.
కుర్చీలో కూర్చొని ఉండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి టీచర్లు ఆయనను చికిత్స కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. గుండెపోటుతో ఉపాధ్యాయుడు స్కూల్లో చనిపోవడంతో టీచర్లు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు.