ప్రోటోకాల్ పాటించలేదని జెడ్పీ చైర్మన్ అసహనం

ప్రోటోకాల్ పాటించలేదని జెడ్పీ చైర్మన్ అసహనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధికారుల తీరుపై జిల్లా జడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన కంటి వెలుగు సమావేశంలో ప్రోటోకాల్ పాటించలేదని జడ్పీ చైర్మన్ శ్రీహర్ష అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణరెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ ముందే తనకు అవమానం జరిగిందని వాపోయారు.  

దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అయినందునే తనను చిన్నచూపు చూస్తున్నారని శ్రీహర్ష ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగానే కంటి వెలుగు సమావేశంలోనూ తనను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. జిల్లా పరిపాలన యంత్రాంగం తీరు మార్చుకోకపోతే ఉన్నత స్థాయిలో ఫిర్యాదు చేస్తానని ఆమె హెచ్చరించారు.