కొడంగల్ లో రేవంత్ దే విజయం..జడ్పీటీసీ రఘుపతిరెడ్డి

కొడంగల్ లో రేవంత్ దే విజయం..జడ్పీటీసీ రఘుపతిరెడ్డి

మద్దూరు, వెలుగు : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని జడ్పీటీసీ రఘుపతిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసిమీడియాతో మాట్లాడారు.వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈసారి కొడంగల్  నుంచి రేవంత్​రెడ్డి పోటీ చేస్తున్నారని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. 

ఐదేండ్లు గడుస్తున్నా కొడంగల్ కు సాగు నీటిని తీసుకొనిరావడంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడని విమర్శించారు. ఖమ్మంలో తెలంగాణ జన గర్జన సభ సక్సెస్​ కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. మల్లికార్జున్, సంజీవ్, రహీం, బాల్ రాజ్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.