ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోంది

ధరలు పెంచుతూ కేంద్రం ప్రజలను దోచుకుంటోంది

కోల్‌‌కతా: బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలను దోచుకుంటోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై ఆమె విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. దేశంలో ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు, చమురు ధరలను పెంచడం సరికాదంటూ ఫైర్ అయ్యారు. పన్నులు తగ్గించాలనే ఆలోచన కేంద్రానికి లేదని తెలిపారు. కేంద్ర సర్కార్ వెంటనే ఎల్పీజీ ప్రైజ్‌‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు.