మరో డైరెక్టర్ తో మెగా గేమ్ ఛేంజర్ ?

మరో డైరెక్టర్ తో మెగా గేమ్ ఛేంజర్ ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)  హీరో గా తమిళ శంకర్(Shankar)  దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'గేమ్ ఛేంజర్'(Game Changer). తాజాగా కొత్త షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందట.. కానీ ఈ కొత్త షెడ్యూల్ ను  డైరెక్టర్ శంకర్ కాకుండా మరో దర్శకుడు గేమ్ ఛేంజర్ సెట్ లోకి అడుగు పెడుతున్నట్టు సమాచారం.

రామ్ చరణ్ కు కూతురు పుట్టడంతో 45 రోజుల పాటు షూటింగ్ కు విరామం ఇచ్చిన విషయం తెలిసేందే. డైరెక్టర్ శంకర్ ఆ లోపు ఇండియన్ 2 సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. కనుకే మరో టాలెంటేడ్ డైరెక్టర్ తో షూటింగ్ ప్లాన్ చేశారని టాక్. 

రామ్ చరణ్ లేని కొన్ని కామెడీ ట్రాక్ సీన్స్ .. లాంగ్ షాట్ సన్నివేశాల ను శంకర్ కాకుండా శైలేష్ కొలను తీస్తున్నాడట. HIT మూవీ ప్రాంచైజీ తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శైలేష్ తో తెరకెక్కించాలని టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు తో పాటు రామ్ చరణ్ కు బాగా క్లోజ్ అవ్వడంతో శైలేష్ కు డైరెక్షన్  బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 

డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu)  క్రెయేటివిటీ, డైరెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుందని నిరూపించుకున్నారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు శైలేష్. ఇప్పుడు మెగా గేమ్ ఛేంజర్ కోసం కపిత్థా షెడ్యూల్ లో ఎలాంటి ప్రయోగాలు చేస్తాడో చూడాలి. 

ఎస్.ఎస్. థమన్‌ సంగీతం అందిస్తుండగా.. కియారా అద్వాణి, అంజలి , ఎస్.జె.సూర్య, సునీల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు . గేమ్ ఛేంజర్ మూవీ కథను కార్తీక్ సుబ్బరాజు అందించగా,సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.   
 దిల్ రాజ్ నిర్మిస్తున్న 50వ మూవీ కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మూవీ 2024 సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.