‘1961లో బంజారా గిరిజనుల జీవనం’ ఆవిష్కరణ

‘1961లో బంజారా గిరిజనుల జీవనం’ ఆవిష్కరణ

బషీర్​బాగ్, వెలుగు: బంజారా ప్రజల స్థిగతులపై రూపొందించిన ఆంగ్ల మోనోగ్రాఫ్ ను నేటి తరానికి ఉపయోగపడేలా తెలుగులో అనువదించి, ప్రచురించడం అభినందనీయమని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎ.కోదండరాం అన్నారు. ఇలాంటి పుస్తకాలు గిరిజన జాతిని జాగృతం చేస్తాయని పేర్కొవన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బంజారా రచయితల సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో రూపొందించిన 1961లో బంజారా గిరిజనుల జీవనం అనే పుస్తకాన్ని మంగళవారం ఆయన ఆవిష్కరించారు.

గిరిజన జాతుల గత, నేటి పరిస్థితులు, వారి జీవన విధానంపై రచయిత కూలంకషంగా తెలుసుకొని, మరో ప్రచురణ తేవాలని సూచించారు. డీఆర్ఎస్.కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అనువాదకులు ప్రొఫెసర్ జె.రాజారాం నాయక్, అంగోతు రాంబాబు నాయక్, ముడావత్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.