నమామీ గంగా ప్రాజెక్టులో దారుణం : ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి

నమామీ గంగా ప్రాజెక్టులో దారుణం :  ట్రాన్స్‌ఫార్మర్ పేలి 10 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో దారుణం జరిగింది.  చమోలి జిల్లాలో అలకనంద నది ఒడ్డున 2023 జూలై 19 బుధవారం రోజున ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో కరెంట్ షాక్ తో పది మంది మృతి చెందారు, 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు.  ముగ్గురి పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం.  నమామీ గంగా ప్రాజెక్టు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది

ఈ ఘటనలో బద్రీనాథ్‌ హైవేపై ఉన్న పోలీస్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి కూడా మృతి చెందారు.  పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లో నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి, గంగా సహా ఇతర నదులు ఉప్పొంగుతున్నాయి.

 

#WATCH | Uttarakhand: 10 people died and several were injured after a transformer exploded on the banks of the Alaknanda River in the Chamoli district. Injured have been admitted to the district hospital: SP Chamoli Parmendra Doval pic.twitter.com/QKC5vpvbF5

— ANI (@ANI) July 19, 2023