
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 220, గుంటూరు జిల్లాలో 144, చిత్తూరు జిల్లాలో 123, కడప జిల్లాలో 117, విజయనగరం జిల్లాలో 100, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 8,766 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది చనిపోయారు. లేటెస్టు మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,672కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,05,052 మంది కరోనా బారినపడగా, వారిలో 22,27,985 మంది కోలుకున్నారు. ఇంకా 62,395 మంది చికిత్స పొందుతున్నారు.
మరిన్ని వార్తల కోసం...