ముక్కలుగా కూలిపోయిన రైల్వే బ్రిడ్జి.. 17 మంది మృతి

  ముక్కలుగా కూలిపోయిన రైల్వే బ్రిడ్జి.. 17 మంది మృతి

మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో కనీసం 17 మంది కార్మికులు మరణించారు.  30 నుంచి 40 మంది వరకు గాయపడ్డారు. ఐజ్వాల్ సమీపంలోని సాయిరాంగ్‌లో2023 ఆగస్టు 23  బుధవారం ఉదయం నిర్మాణ పనులు జరుగుతుండగా వంతెన కూలిపోయింది.  శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకున్నారు.  ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.  

ఈ ఘటన పట్ల ఆ రాష్ట్ర సీఎం స్పందించారు. " ఈ దుర్ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను " అంటూ సీఎం ట్వీట్ చేశారు.