హిందూ సంప్రదాయంలో అగర్ బత్తీలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పూజ చేసే సమయంలో ధూపమాగ్రాపయామి అని మంత్రం చదివినప్పుడు అగర్ బత్తీ వెలిగించమని చెబుతుంటారు. ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది. సైంటిఫిక్గా అగర్ బత్తీని వెలిగించడం వల్ల ఒత్తిడి , ఆందోళన తగ్గించడం... మెరుగైన నిద్రకు ఉపక్రమించడం లాంటివి అగర్బత్తీని వెలిగించడం వలన సాధ్యపడతాయి. అగర్ బత్తీ వెలిగించడం వల్ల కలిగే ఆరు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. . . .
మానసిక స్థితి: రెండు అగర్ బత్తీలను వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సాధారణంగా పూజ సమయంలో వెలిగిస్తుంటారు. అగర్ బత్తీని వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి.. ఉదయం చాలా ఎలాంటి ఆందోళన లేకుండా ఉండేలా చేస్తుంది.
యోగా: వ్యాయామం చేసే ప్రదేశాల్లో ... ముందు అగర్ బత్తీని వెలిగించి .. ఆ తరువాత ధ్యానం చేస్తారు. ఈ ప్రదేశాల్లో ధూపం వేయడం వల్ల శక్తి ఉంటుందని భావిస్తారు. వ్యాయామం చేసేందుకు సానుకూల వాతావరణం కల్పించడంలో అగర్ బత్తీల ధూపం కీలక పాత్ర పోషిస్తుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు అగర్ బత్తీతో ధూపం వేస్తారు. ఇది ఆ ప్రాంతంలో నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని చెబుతుంటారు.
అరోమాథెరపీ: రోజూ ఉదయం .. సాయంత్రం అగర్ బత్తీలు వెలిగిస్తే... నూనెలు మెదడులోని కొన్ని ప్రాంతాలను సక్రియం చేస్తాయి. అవి హైపోథాలమస్పై కూడా ప్రభావం చూపుతాయి, సెరోటోనిన్ వంటి అనుభూతిని కలిగించే మెదడు రసాయనాలను సృష్టించడం ద్వారా చమురుకు ప్రతిస్పందనలు కలుగజేస్తాయి.
మెరుగైన నిద్ర: నిద్రకు ఉపక్రమించే సమయంలో రెండు అగర్ బత్తీలను వెలిగించడం ద్వారా గదిలో మంచి వాసన ఉంటుంది. ఇది రాత్రి సమయంలో మంచి నిద్ర పట్టేందుకు దోహదపడుతుంది. దీంతో ఉదయాన్నే లేవగానే రీఫ్రెష్గా ఉంటారు.
ఆత్మపరిశీలన: ప్రశాంతమైన.... రిఫ్రెష్ వాతావరణంలో ఆత్మపరిశీలన చేసుకోవడంలో చాలా ఉపయోగపడుతుంది. అగర్ బత్తీల ధూపం ప్రత్యేకమైన సువాసనతో శక్తిని కలిగి ఉంటుంది. , ఇది మన జీవిత ప్రయాణాన్ని లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.
సృజనాత్మకత: అగర్ బత్తీల పరిమళాలు ఇంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. ఆ ప్రాంతంలో పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై ఉంటుంది.