
బొగోటా:కొలంబియా రాజధాని బొగోటాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.5గా నమోదైంది. బలమైన భూప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు రోడ్లు, ఫుట్పాత్లు దెబ్బతిన్నాయి.
కొన్ని బిల్డింగులు డ్యామేజీ అయ్యాయి. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బలమైన ప్రకంపనలు సంభవించాయని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని చెప్పారు. ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగాయని, బాధితులకు అవసరమైన సాయం అందజేస్తున్నాయని అధికారులు తెలిపారు.