
మహబూబ్నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాకు నాలుగు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ) మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోమవారం సాయంత్రం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లభించింది. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలంలోని పల్లమర్రి, జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం ఈద్గాన్పల్లి, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, నాగర్కర్నూల్ నియోజకవర్గంలోని తూడుకుర్తి గ్రామంలో వీటిని ఏర్పాటు చేయనుంది.
ఐటీఐలకు అనుబంధంగా ఈ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్) సహకారంతో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. వీటికి సంబంధించిన నిధుల్లో కొంత భాగం టాటా, మిగిలిన భాగం రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.