
మానవపాడు,వెలుగు: కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 70 ఆవులను పుల్లూరు చెక్ పోస్ట్ టోల్ ప్లాజా దగ్గర మంగళవారం పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తున్న 70 ఆవులను ఉండవెల్లి పోలీసులు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర పట్టుకున్నారు. పట్టుబడిన ఆవులను మానవపాడు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ గ్రౌండ్కు తరలించారు.
అస్వస్థతతో నాలుగు ఆవులు చనిపోయాయి. మిగతా 63 ఆవులను ఆసక్తి ఉన్న పాడి రైతులకు పెంచుకునేందుకు విశ్వహిందూ పరిషత్ వారు పంపిణీ చేశారు. రైతుల ఆధార్ కార్డు తీసుకొని వారి పేర్లను నమోదు చేసుకుని ఆవులను అందజేశారు. మృతి చెందిన నాలుగు ఆవులను పోలీసులు, వెటర్నరీ డాక్టర్ల పంచనామా జరిపి పూడ్చిపెట్టారు.