శివకాశిలో ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది మృతి

 శివకాశిలో ఘోర ప్రమాదం..   ఎనిమిది మంది మృతి

తమిళనాడు శివకాశిలో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో ప్రమాదవశాత్తు పేలుడు సంబవించి ఎనిమిది మంది మృతి చెందారు.  ఇందులో . ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.  బాణాసంచా ముడిసరుకు లోడ్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఘటనలో మరో 10 మంది పరిస్థితి సీరియస్ గా ఉండగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. 

ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేస్తున్నాయి. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో ఏడు గదులు ధ్వంసమయ్యాయి.  ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.   అయితే, ఇటీవల చెంగమలపట్టిలోని బాణాసంచా కర్మాగారంలో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో అందులో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించడం అగ్నిమాపక శాఖ, పోలీసులకు సవాల్‌గా మారుతుంది.