ప్రియురాలి ఇంటికెళ్లి హంగామా..ఆత్మహత్య

ప్రియురాలి ఇంటికెళ్లి హంగామా..ఆత్మహత్య

హైదరాబాద్: మద్యం మత్తులో అర్ధరాత్రి ప్రియురాలి ఇంటికెళ్లి హంగామా చేసిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం బాలానగర్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట, నెహ్రు నగర్ కు చెందిన శుభం(26) కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే ఆదివారం రాత్రి 11 గంటలకు శోభన కాలనీలోని ప్రియురాలి ఇంటికి వెళ్లి తనను బయటకు రమ్మని వాదించాడు. ఆ యువతి తల్లిదండ్రులతోనూ వాగ్వాదానికి దిగాడు. అర్ధరాత్రి సమయంలో బయటకు రానని యువతి తేల్చి చెప్పడంతో.. భవనం 4వ అంతస్తు నుండి దూకి శుభం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు.  మద్యం మత్తులో యువతి ఇంటికి వెళ్లి హంగామా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించామన్నారు. అయితే యువతి కుటుంబీకులే తన కుమారుడిని కొట్టి చంపినట్లు యువకుడు తండ్రి ఆరోపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు.