
గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటామని కబ్జాకు గురైన ఇరిగేషన్ శాఖకు చెందిన 70 ఎకరాల అసైన్డ్ భూమి రికవరీకి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ డి.వేణు తెలిపారు. బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియాలో ఏర్పాటు చేసిన చేపల చెరువులను పరిశీలించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు సరఫరా చేసే తాగునీటిలో ఎలాంటి కలుషిత పదార్థాలు లేవన్నారు. చేపల చెరువులకు నీటిని అందిస్తున్న మోటర్లకు కరెంట్ సప్లై నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, అంతర్గాం తహసీల్దార్ రవీందర్, ఇరిగేషన్, ఫిషరీష్ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు ఉన్నారు.