పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేని చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటాం : అడిషనల్​ కలెక్టర్​ డి.వేణు

పర్మిషన్‌‌‌‌‌‌‌‌ లేని చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటాం : అడిషనల్​ కలెక్టర్​ డి.వేణు

గోదావరిఖని, వెలుగు: ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ ఏరియాలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులను స్వాధీనం చేసుకుంటామని కబ్జాకు గురైన ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖకు చెందిన 70 ఎకరాల అసైన్డ్​ భూమి రికవరీకి చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి అడిషనల్​ కలెక్టర్​ డి.వేణు తెలిపారు. బుధవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ ఏరియాలో ఏర్పాటు చేసిన చేపల చెరువులను పరిశీలించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. 

ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్​కు సరఫరా చేసే తాగునీటిలో ఎలాంటి కలుషిత పదార్థాలు లేవన్నారు. చేపల చెరువులకు నీటిని అందిస్తున్న మోటర్లకు కరెంట్‌‌‌‌‌‌‌‌ సప్లై నిలిపివేయాలని ఎన్పీడీసీఎల్​ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పెద్దపల్లి ఆర్డీవో బి.గంగయ్య, అంతర్గాం తహసీల్దార్​ రవీందర్​, ఇరిగేషన్, ఫిషరీష్​ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు ఉన్నారు.