
నిజామాబాద్, వెలుగు : ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మీటింగ్లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలికాప్టర్ కోసం హెలిపాడ్ సిద్ధం చేయడంతో పాటు, ట్రాఫిక్ సమస్య రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్ అంకిత్, కిరణ్కుమార్, నగరపాలక కమిషనర్ దిలీప్కుమార్ తదితరులు ఉన్నారు.