అమిత్షా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష

అమిత్షా పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్, సీపీ సమీక్ష

నిజామాబాద్, వెలుగు : ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా వస్తున్న నేపథ్యంలో కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెలికాప్టర్​ కోసం హెలిపాడ్​ సిద్ధం చేయడంతో పాటు, ట్రాఫిక్​ సమస్య రాకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్ అంకిత్​, కిరణ్​కుమార్​, నగరపాలక కమిషనర్​ దిలీప్​కుమార్​ తదితరులు ఉన్నారు.