అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్పై (Chandrababu) ఏపీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఈ కేసులో ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్లో పెట్టింది హైకోర్టు. అంగళ్లు కేసులో చంద్రబాబు ఏ-1 నిందితుడిగా ఉన్నారు. పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. నీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న సమయంలో.. అంగళ్లు వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు విసిరారని.. తనను సెక్యూరిటీ సిబ్బంది కాపాడారని చంద్రబాబు పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రాసిక్యూషన్ తరపున పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు.
- ALSO READ | ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా నారా లోకేష్
ఈ నెల 22న ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం 26వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అన్న టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.