ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర

ఎవరి కోసం బండి సంజయ్‌ పాదయాత్ర

హైదరాబాద్‌: ఎవరి కోసం బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ధరలకు వ్యతిరేకంగా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని పాదయాత్ర చేస్తున్నారా అని నిలదీశారు. పేదల అకౌంట్స్‌లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పి వేయనందుకా పాదయాత్ర అంటూ మండిపడ్డారు. పెట్రో, డీజిల్‌ ధరలు పెంచమని పాదయాత్ర చేస్తున్నారా సంజయ్‌ చెప్పాలని భట్టి విక్రమార్క అన్నారు.

ఇవి కూడా చదవండి...

మంత్రి జగదీష్ రెడ్డితో కలసి అంబేద్కర్కు నివాళులర్పించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

స్వర్ణదేవాలయం ప్రార్థనల్లో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

ఆలియా–రణబీర్ ఇంట్లో పెళ్లి సందడి షూరూ