
కామారెడ్డిటౌన్, వెలుగు : కేంద్రంలో 11 ఏండ్ల నరేంద్రమోడీ పాలనలో సాధించిన విజయాలు, కేంద్ర పథకాలను బీజేపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి చెప్పాలని ఆ పార్టీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు విపుల్జైన్ పేర్కొన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో పట్టణ ప్రతినిధుల మీటింగ్లో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. సమావేశంలో బీజేపీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ రజనీకాంత్రావు, నాయకులు రాజుపాటిల్, రవీందర్ పాల్గొన్నారు.