తెల్లాపూర్ మున్సిపాలిటీకి బస్సులు నడపండి : బీజేపీ నాయకులు

తెల్లాపూర్ మున్సిపాలిటీకి బస్సులు నడపండి : బీజేపీ నాయకులు
  •    ఆర్టీసీ అధికారులను కోరిన బీజేపీ నాయకులు

రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులు నడపాలని బీజేపీ మున్సిపల్​అధ్యక్షుడు రాంబాబు గౌడ్​, మాజీ కౌన్సిలర్​ శంషాబాద్​ రాజు అధికారులను కోరారు. శుక్రవారం హెచ్​సీయూ డిపో మేనేజర్​ మురళీధర్​రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తెల్లాపూర్​ మున్సిపాలిటీలోని పాటి, వేంకుంట, వెలిమెల, వెలిమెల తండా, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మానగర్, తెల్లాపూర్​ పట్టణం మీదుగా లింగంపల్లి వరకు అటు నుంచి పటాన్​చెరు వరకు బస్​ సర్వీసులు ప్రారంభించాలని కోరారు.

మినీ ఇండియా లాంటి తెల్లాపూర్​ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు, స్టూడెంట్స్​ప్రయాణాలు సాగిస్తుంటారని, మెరుగైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొల్లూర్​లోని డబుల్ బెడ్రూమ్​ నివాసాలకు వేలాది మంది నిరుపేదలు వచ్చారని వారి అవసరాలకు అనుగుణంగా బస్​ సర్వీసులు పెంచాలన్నారు. దీనిపై డిపో మేనేజర్​ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలను చేసి తెల్లాపూర్​కు బస్​ సర్వీసులు పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.