
- ఆర్టీసీ అధికారులను కోరిన బీజేపీ నాయకులు
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలను కలుపుతూ ఆర్టీసీ బస్సులు నడపాలని బీజేపీ మున్సిపల్అధ్యక్షుడు రాంబాబు గౌడ్, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు అధికారులను కోరారు. శుక్రవారం హెచ్సీయూ డిపో మేనేజర్ మురళీధర్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీలోని పాటి, వేంకుంట, వెలిమెల, వెలిమెల తండా, ఈదులనాగులపల్లి, కొల్లూర్, ఉస్మానగర్, తెల్లాపూర్ పట్టణం మీదుగా లింగంపల్లి వరకు అటు నుంచి పటాన్చెరు వరకు బస్ సర్వీసులు ప్రారంభించాలని కోరారు.
మినీ ఇండియా లాంటి తెల్లాపూర్ ప్రాంతంలో వేలాది మంది కార్మికులు, స్టూడెంట్స్ప్రయాణాలు సాగిస్తుంటారని, మెరుగైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కొల్లూర్లోని డబుల్ బెడ్రూమ్ నివాసాలకు వేలాది మంది నిరుపేదలు వచ్చారని వారి అవసరాలకు అనుగుణంగా బస్ సర్వీసులు పెంచాలన్నారు. దీనిపై డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే క్షేత్రస్థాయి పరిశీలను చేసి తెల్లాపూర్కు బస్ సర్వీసులు పెంచుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.