జనగామ అర్బన్/ తొర్రూరు, వెలుగు: తుఫాన్ కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో బీజేపీ నాయకులు పర్యటించారు. బుధవారం జనగామ జిల్లా చీటకోడూర్లో తెగిపోయిన బ్రిడ్జిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ఆధ్వర్యంలో సందర్శించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆయన బ్రిడ్జి నిర్మాణం కోసం నిరసన తెలిపిన యువకులు అరెస్ట్ కావడంతో వారిని పరామర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు లేగా రాంమోహన్రెడ్డి నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.
