స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు నేలకొరిగారు

స్వాతంత్య్రం కోసం ఎందరో మహనీయులు నేలకొరిగారు

హైదరాబాద్: మనకు స్వాతంత్య్రాన్ని తీసుకురావడానికి ఎందరో మహనీయులు నేలకొరిగారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆదివారం ట్యాంక్ బండ్ పై ఉన్న మహనీయుల విగ్రహాలను ఎంపీ లక్ష్మణ్ శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశానికి స్వేచ్ఛను ప్రసాదించడానికి గాంధీ, అంబేద్కర్, పటేల్ వంటి మహనీయులు బ్రిటిష్ పాలకులతో వీరోచితంగా పోరాడారన్నారు. 

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్న లక్ష్మణ్... వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.