గూడెం లిఫ్ట్ పైపు లైన్లు మార్చాలె: వివేక్ వెంకటస్వామి

గూడెం లిఫ్ట్ పైపు లైన్లు మార్చాలె: వివేక్ వెంకటస్వామి

రైతులను కోటీశ్వరులను చేస్తానని చెప్పిన కేసీఆర్... ఆయన కుటుంబాన్ని, కాంట్రాక్టర్లను కోటీశ్వరులుగా మార్చిండని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా రంగంపల్లే వద్ద పగిలిన గూడెం లిఫ్ట్ పైపు లైన్ ను పరిశీలించిన వివేక్ వెంకటస్వామి.. గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ పైపు లైన్ ను మారుస్తామని మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో మాట ఇచ్చిండు.. కానీ ఇప్పటివరకూ అమలు చేయలేదన్నారు. పైపు లైన్లు పగిలి ఐదేళ్లవుతున్నా రైతులకు నీరు అందడం లేదని మండపడ్డారు. 

పైపు లైన్లు పగిలి నీరందక.. ముప్పై వేల ఎకరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారని వివేక్ వెంకటస్వామి అన్నారు. లిఫ్ట్ పైపు లైన్లు మార్చి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. శ్రీరామ్ సాగర్ నుండి గతంలో మంచిర్యాల జిల్లా ప్రాంతానికి నీళ్లు వచ్చేవి.. కానీ ఇప్పుడు నీళ్లు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కడెం ప్రాజెక్ట్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీటిని సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.