యాదాద్రి, వెలుగు: ‘ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేసిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసుల పెడతరా..? వాళ్లేమైనా టెర్రరిస్టులా?’ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. ‘ఇక నుంచి ఆత్మ బలిదానాలు, మీ ప్లెక్సీలకు పాలాభిషేకాలు ఉండవు. బీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు మీ ఫ్లెక్సీలకు పెట్రోల్ అభిషేకాలు చేస్తారు’ అని ఆయన హెచ్చరించారు. మంత్రి జగదీశ్రెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని బీజేపీ స్టేట్ లీడర్ గూడూరు నారాయణ రెడ్డి సహా నలుగురు రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో పాటు రైతులను రిమాండ్కు పంపడంతో వారిని కలవడానికి భువనగిరి సబ్ జైలుకు నర్సయ్య వెళ్లారు.
అయితే ఆయన ములాఖత్కు జైలు అధికారులు అవకాశమివ్వలేదు. దీంతో నర్సయ్య గౌడ్ సబ్ జైలు ముందు బైఠాయించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే శేఖర్రెడ్డి వంద ఎకరాల భూమిని కాపాడుకోవడానికి మంత్రి జగదీశ్రెడ్డి సాయంతో కుట్రపూరితంగా అలైన్మెంట్మార్చారని ఆరోపించారు. మంత్రి తన బంధువు ఈఎన్సీ గణపతి రెడ్డి సాయంతో యాదగిరిగుట్ట టెంపుల్ వెనుక వైపు నుంచి రావాల్సిన అలైన్మెంట్ను మార్పించారన్నారు. పదవులను అడ్డం పెట్టుకొని రూ.వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. మాయ దశరథ, పడమటి జగన్మోహన్ రెడ్డి, పడాల శ్రీనివాస్, సూదగాని హరిశంకర్ గౌడ్ ఉన్నారు.