చంద్రబాబుకు సీఐడీ షాక్ :క్వాష్ పై వాదనలు వినాలంటూ పిటిషన్

చంద్రబాబుకు సీఐడీ షాక్ :క్వాష్  పై వాదనలు వినాలంటూ పిటిషన్

టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) కేసు కీలక మలుపులు తిరుగుతోంది.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని సీఐడీ కేవియట్ దాఖలు చేసింది. 

చంద్రబాబు కేసు విషయంలో  సీఐడీ మరో అడుగు వేసింది.   నిన్న ( సెప్టెంబర్ 27)  సుప్రీంకోర్టు(Supreme Court)లో ఒకే రోజు రెండు బెంచ్ ల వద్ద వాదనలు జరిగిన తరువాత ... అక్టోబర్ 3న విచారణకు నిర్ణయించారు.  సుప్రీంలో  సీఐడీ కేవియట్(Caveat) దాఖలు చేసింది. చంద్రబాబు పిటీషన్ పైన తమ వాదనలు వినకుండా నిర్ణయం తీసుకోవద్దని  సీఐడీ కోరింది. 

సుప్రీంలో కేవియట్  

చంద్రబాబు అరెస్ట్ సమయంలో అనుసరించిన విధానాన్ని  చంద్రబాబు లాయర్లు పేర్కొన్నారు.   సెక్షన్లు..17ఏ అంశం ప్రస్తావనతో పాటుగా అసలు ఎఫ్ఐఆర్(FIR) లో పేరు లేకుండా అరెస్ట్ చేసారనే అంశాలను వివరించారు.  ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీకి కోరుతోందని..నిరోధించాలని లూధ్రా కోరారు. విచారణ కోర్టు కస్టడీ గురించి విచారించే సమయంలో తాము నియంత్రించలేమని చెప్పిన సీజే ఈ కేసును ప్రత్యేక బెంచ్ కు బదిలీ చేస్తామని..అక్టోబర్ 3న విచారణకు వస్తుందని వెల్లడించారు.

సీఐడీ(CID) ఈ కేసులో సుప్రీంలో కేవియట్ దాఖలు చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన ఈ పిటీషన్ లో స్కిల్ కేసు(skill Cae)లో చంద్రబాబు పై నమోదైన ఎఫ్ఐఆర్ పైన స్టే ఇవ్వాలని..జ్యుడిషియల్ రిమాండ్ ను సస్పెండ్ చేయాలని..ప్రస్తుత విచారణ ప్రొసీజర్ జరుగుతుందో అది పూర్తిగా నిలిపివేయాలని అభ్యర్దించారు.

విచారణపై ఉత్కంఠ 

అక్టోబర్ 3న సుప్రీం కోర్టులో చంద్రబాబు(Chandra Babu) పిటీషన్ విచారణ ఏ బెంచ్ లో జరగనుందనేది లిస్టు కావాల్సి ఉంది. అయితే, ఆ రోజున అన్ని అంశాలను పూర్తిగా విచారించి నిర్ణయం తీసుకుంటారని సీజే చెప్పారు. ఇప్పుడు సీఐడీ కేవియట్ దాఖలు చేయటంతో..రెండు పక్షాల వాదనలు కోర్టు ముందు వినిపించనున్నారు. దీంతో ఈ వ్యవహారంలో అక్టోబర్ 3న సుప్రీంలో  ఏ నిర్ణయం వెలువడుతుందనే దాని పైన ఉత్కంఠ కొనసాగుతోంది.