భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ పమేలా సత్పతి

భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ పమేలా సత్పతి

కొత్తపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని, భూ సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడ్​, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ అవగాహనా సదస్సుల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. 

జూన్ 20 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆసిఫ్​నగర్, దుర్శేడ్​ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, తహసీల్దార్లు ఎన్.రాజేశ్​, ఆర్.వెంకటలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. జమ్మికుంట మండలం విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 71 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంకట్ రెడ్డి తెలిపారు. 

భూభారతి చట్టంతో సమస్యలు తీరుతాయి 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: భూ భారతి చట్టంతో భూసమస్యలు తీరుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మంగళవారం ఇల్లంతకుంట మండలం ముస్కానీపేటలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూధార్ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇక నుంచి భూముల క్రయ విక్రయాలకు తప్పనిసరిగా మ్యాప్ జత చేయాలన్నారు.

 కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఇల్లంతకుంటతహసీల్దార్ ఫారూఖ్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. బోయినిపల్లి మండలంలోని విలాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దుండ్రపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో 58 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నారాయణరెడ్డి తెలిపారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మొత్తం 1103 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బోయినిపల్లి 64, చందుర్తి 53, ఇల్లంతకుంట 55, గంభీరావుపేట 50, కోనరావుపేట 134, ముస్తాబాద్ 183, సిరిసిల్ల 27, తంగళ్లపల్లి 17, వేములవాడ123, వేములవాడ రూరల్ 26, వీర్నపల్లి 266, ఎల్లారెడ్డిపేట105 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు.

జూన్​ 20 వరకు రెవెన్యూ సదస్సులు

మెట్ పల్లి/జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు: భూసమస్యలు లేని తెలంగాణగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న  భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బి.సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం పెద్దాపూర్, ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్ కొండాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ పరిశీలించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జూన్‌‌‌‌‌‌‌‌ 20 వరకు రెవెన్యూ సదస్సుల్లో భాగంగా అధికారుల బృందాలు గ్రామాల వారీగా సందర్శించి రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, వరప్రసాద్,  అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం చల్‌‌‌‌‌‌‌‌గల్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్‌‌‌‌‌‌‌‌ రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 

పెద్దపల్లి జిల్లాలో 1063 అప్లికేషన్లు 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 1063 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అంతర్గాం 43,  ధర్మారం 109,  జూలపల్లి  165, కమాన్‌‌‌‌‌‌‌‌పూర్​ 9, మంథని  182,  ఓదెల 140, పాలకుర్తి  65, పెద్దపల్లి 157, రామగిరి 10,  రామగుండం 5,  శ్రీరాంపూర్​  121,  సుల్తానాబాద్​ 57 వచ్చినట్లు 
తెలిపారు.