
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, వెలుగు: పట్టణంలోని గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్లో వసతుల కల్పనకు అవసరమైన ఫండ్స్ఇస్తామని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు తెలిపారు. నిజామాబాద్నగరపాలక సంస్థ బిల్డింగ్లో కొనసాగుతున్న వెల్నెస్సెంటర్ ను శనివారం ఆయన విజిట్ చేశారు. సెంటర్లో వెయిటింగ్ హాల్, స్త్రీ, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఏర్పాటు చేయాలన్నారు.
నాణ్యమైన వైద్య సేవలందించాలని డాక్టర్లకు సూచించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ఆఫీస్కు వెళ్లిన కలెక్టర్అక్కడ మీటింగ్ హాల్, వెహికల్స్పార్కింగ్కు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ దిలీప్కుమార్, ఇన్ చార్జి ఆర్డీవో స్రవంతి, రిటైర్డ్ఉద్యోగుల సంఘం లీడర్లు రవీందర్రావు, భూమాగౌడ్, రామ్మోహన్రావు ఉన్నారు.