పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యం

దంతాలపల్లి, వెలుగు: పేదల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రామచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్​ జిల్లా వంతడుపుల స్టేజి వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 

కార్యకర్తలు ప్రజలకు అండదండగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు గుర్తించి నాయకుడిగా ఎన్నుకుంటారన్నారు. గ్రామాల్లో ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి డిప్యూటీ స్పీకర్​ పదవి రావడంతో స్థానికులు ఘనంగా సన్మానించారు.