భూభారతి తోనే రైతులకు మేలు : వినయ్​ రెడ్డి

భూభారతి తోనే రైతులకు మేలు : వినయ్​ రెడ్డి
  • కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​ రెడ్డి

​ఆర్మూర్, వెలుగు : భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారమై రైతులకు మేలు జరుగుతుందని కాంగ్రెస్​ఆర్మూర్  నియోజకవర్గ ఇన్​చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సుర్భిర్యాల్ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. సదస్సుకు వచ్చిన అప్లికేషన్స్ పరిశీలించి,  త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ సుజాతను కోరారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్​లో ఇందిరమ్మ ఇండ్ల  మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబా గౌడ్, పండిత్ పవన్ పాల్గొన్నారు. 

 తాడ్వాయి మండలంలో..

తాడ్వాయి, వెలుగు : రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ శ్వేత అన్నారు. శుక్రవారం మండలంలోని దేమికలన్, సంగోజి వాడి గ్రామాల్లోని  రెవెన్యూ సదస్సుల్లో ఆమె మాట్లాడారు.  ఎలాంటి భూ సమస్యలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలన్నారు.