భక్తులతో కిటకిటలాడుతున్న బాసర 

భక్తులతో కిటకిటలాడుతున్న బాసర 

గోదవరిలో పుణ్య స్నానాలు..​​జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తుల పూజలు

నిర్మల్ జిల్లా: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.  ద్వాదశి శుక్రవారం కావడంతో ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తెలంగాణతోపాటు ఇరుగు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల  నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు భక్తులు. 

 

 

ఇవి కూడా చదవండి

ఇన్ఫోసిస్‌‌ సలీల్ పరేఖ్ శాలరీ రూ.79.75 కోట్లు..

పెంపుడు కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ

ప్రభుత్వ ఆస్తులను వదిలేసి ప్రజలపై బల్దియా ప్రతాపం

బర్త్​కు బదులు డెత్​ తప్పులతడకగా సర్టిఫికెట్ల జారీ