మనామ(బహ్రెయిన్): పాలస్తీనాకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినందుకు బహ్రెయిన్లో ఉంటున్న మనదేశ సంతతికి చెందిన డాక్టర్ సునీల్ రావు ఉద్యోగం కోల్పోయారు. రాయల్ హాస్పిటల్లో ఆయన మెడిసిన్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. సునీల్ రావును తొలగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు శుక్రవారం ప్రకటించాయి.
పాలస్తీనాకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్ట్లు తమ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నాయి. ‘‘సునీల్ రావు చేసిన ట్వీట్లతో ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదు. అవి ఆయన వ్యక్తిగతం. ఆయన పోస్ట్లు వైద్య వ్యవస్థకే అవమానకరం. అందుకే ఆయనను తొలగిస్తున్నాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం”అని ఆస్పత్రి ప్రకటనలో తెలిపింది.
