హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిన వివేక్ అభిమానులు

 హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలిన వివేక్ అభిమానులు

పెద్దపల్లి, వెలుగు: మైనింగ్​, కార్మిక శాఖ మంత్రిగా డాక్టర్​ గడ్డం వివేక్​ వెంకటస్వామి బుధవారం సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్​ లీడర్లు, కార్యకర్తలు, కాకా కుటుంబ అభిమానులు పెద్దసంఖ్యలో హైదరాబాద్​తరలివెళ్లారు. మంత్రిగా వివేక్​ వెంకటస్వామి బాధ్యతల స్వీకరణ తర్వాత బొకేలు, శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్​శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వివేక్​ వెంకటస్వామిని గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్​ లీడర్లు కోరం నరేందర్​ రెడ్డి, దుబాసి మల్లేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గడ్డం మధు, మాల మహానాడు ఆఫ్ ఇండియా యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్​, పెద్దపల్లి జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎరకల కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.