
పెద్దపల్లి, వెలుగు: మైనింగ్, కార్మిక శాఖ మంత్రిగా డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం సెక్రటేరియట్లో బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా నుంచి కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, కాకా కుటుంబ అభిమానులు పెద్దసంఖ్యలో హైదరాబాద్తరలివెళ్లారు. మంత్రిగా వివేక్ వెంకటస్వామి బాధ్యతల స్వీకరణ తర్వాత బొకేలు, శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామిని గోదావరిఖనికి చెందిన కాంగ్రెస్ లీడర్లు కోరం నరేందర్ రెడ్డి, దుబాసి మల్లేశ్, గడ్డం మధు, మాల మహానాడు ఆఫ్ ఇండియా యువజన విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్, పెద్దపల్లి జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎరకల కిశోర్, తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.